AP: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇప్పటికే విచారణకు హాజరైన ఆయన.. కోటరీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ సీఐడీ విచారణకు హాజరైతే ఎలాంటి బాంబు పేలుస్తారోనన్న ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. భవిష్యత్లో అన్నీ చెబుతానని విజయసాయిరెడ్డి ఇప్పటికే హింట్ ఇచ్చారు. ఆయన మీడియా ముందుకు వస్తున్నారంటే వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు. ఆయన ఎలాంటి కామెంట్స్ చేస్తారోనని భయపడిపోతున్నారు.