విజయవాడలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఎన్టీఆర్ జిల్లా అధికారులతో కలెక్టర్ సృజన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలపై అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లోకి మళ్లీ వరదనీరు చేరే అవకాశముందన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని వారిని చీకటిపడేలోగా పునరావాస శిబిరాలకు తరలించాలని సూచించారు. పునరావాస శిబిరాల్లో ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించాలన్నారు.