విశాఖ నుంచి చర్లపల్లి వెళ్లే సికింద్రాబాద్ జనసాధారణ్ రైలు ఖాళీగా బయలుదేరింది. రైల్వే అధికారులు ఎలాంటి ప్రచారం చేయకపోవడం వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. పావుగంట ఆలస్యంగా విశాఖ నుంచి ఉదయం 10 గంటలకు ఈ రైలు బయలుదేరింది. ఓవైపు సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వచ్చిన వారు రైళ్లలో సీట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇలా జరగడం గమనార్హం.