అనకాపల్లిలో సుప్రసిద్ధ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి శతజయంతి ముగింపు ఉత్సవాలు మంగళవారo ప్రారంభమయ్యాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆలయ మంటపంలో పూజాది, హోమ కార్యక్రమాలు చేపట్టారు. సాయంత్రం వెండి రథంపై తిరువీధుల్లో మేళతాళాలతో అమ్మవారు ఊరేగింపు శోభయాత్ర ఘనంగా ప్రారంభమైంది. ఈ ఊరేగింపులోపలు సంస్కృత కార్యక్రమాలు, మహిళలైతే వాసవి మాత నామసంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు.