అనకాపల్లి పట్టణం గవరపాలెం దాసరి గడ్డ రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ సత్తెమ్మతల్లి అమ్మవారి ఆలయం వద్ద ఈ నెల 3వ తేదీ శనివారం భారీ అన్నసమారాధన కార్యక్రమం జరగనుంది. అమ్మవారి 33వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఆరోజు ఉదయం నుండి అమ్మవారికి ప్రత్యేక
పూజలు, అలంకరణలు, భజనలు, ఏకాహం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్న సమారాధన జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 4 నుండి అమ్మవారికి సారే ఊరేగింపు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.