అరకులోయ మండలంలోని మాడగడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి నందిగుడలో ఆరోగ్య సిబ్బంది ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్మూలన కొరకు పెద్దలకు గురువారం బీసీజీ టీకాలు వేశారు. ఈ కార్యక్రమానికి ఏఎన్ఏం కమలమ్మ హెల్త్ సూపర్వైజర్ కుమారి పాల్గొని 18ఏళ్లు పైబడిన వారికి టీకాలను వేశారు. హెల్త్ సూపర్వైజర్ కుమారి మాట్లాడుతూ క్షయవ్యాధి నిర్మూలనే లక్ష్యంగా తొలిసారిగా 18ఏళ్లు పైబడిన వారు ఈ టీకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.