సీకరి పంచాయతీ గ్రామాల్లో ముమ్మరంగా వరి నాట్లు

69చూసినవారు
పెదబయలు మండలంలో కురుస్తున్న వర్షాలతో వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలోని సీకరి లక్ష్మీపేట పంచాయితీల తదితర గ్రామాల్లో వరినాట్ల ప్రక్రియను త్వరితగతిన ముగించేందుకు రైతులు పనులు ప్రారంభించారు. మరోవైపు పలుచోట్ల విత్తనాలు వేసే విధానం ఈ సారీ పెద్ద ఎత్తున సాగుతుందని రైతులు తెలిపారు. ఇప్పటికే నారు పోసిన రైతులు నాట్లు వేసేందుకు చర్యలు చేపట్టామని పలువురు రైతులు గురువారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్