డుంబ్రిగుడ మండలంలోని అరుకులో ఆవులు, ఎద్దులు ప్రధాన రహదారిపై సంచరిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. పశువుల వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతూ ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. లేదా తీవ్రంగా గాయపడి నెలలపాటు శాశ్వతంగా మంచానికి పరిమితమవుతున్నారని పలువురు గిరిజనులు మండిపడుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత అధికారులు స్పందించాలని గిరిజనులు గురువారం కోరారు.