ఇటీవల కురిసిన భారీ వర్షాలకు డుంబ్రిగుడ మండలంలోని డోమంగికి వెళ్లే వంతెన ప్రక్కన కల్వర్టు కొట్టుకుపోయింది. దీనితో సుమారు 50 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కల్వర్టుకి నిర్మాణం చేపట్టాలని అధికారులకు విన్నవించిన పట్టించుకోకపోవడంతో స్పందించిన పంచాయతీ సర్పంచ్ నాగేశ్వరావు సొంత నిధులతో గురువారం కొట్టుకుపోయిన కల్వర్టుకి మరమ్మత్తులు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.