తమ సమస్యలు పరిష్కరించాలని గొలుగొండ మండల భవన నిర్మాణ కార్మికులు గురువారం శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, కౌన్సిలర్ పద్మావతికి నర్సీపట్నంలో వినతిపత్రం అందజేశారు. తమకు ఇసుకను అందుబాటులోకి తేవాలని కోరారు. ఈ సమస్యను స్పీకర్ దృష్టికి తీసుకువెళ్తానని పద్మావతి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు గెడ్డం నానాజీ పాల్గొన్నారు.