
69 ఎయిర్పోర్టుల్లో CISF తనిఖీలు
పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలతో దేశ వ్యాప్తంగా 69 విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేస్తోంది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కార్గో, బ్యాగేజ్ స్క్రీనింగ్ వ్యవస్థల వద్ద పర్యవేక్షిస్తున్నారు. అయితే మరోవైపు కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించాయి. దీంతో విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకోనున్నాయి.