పెన్షన్ పంపిణీని పరిశీలించిన ఎంపీడీవో

83చూసినవారు
పెన్షన్ పంపిణీని పరిశీలించిన ఎంపీడీవో
నాతవరం మండలం డి. ఎర్రవరం, వలసంపేట సచివాలయ పరిధిలోని గ్రామాల్లో జరుగుతున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీవో రాంబాబు గురువారం పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకు 92 శాతం పంపిణీ కార్యక్రమం పూర్తయిందని చెప్పారు. శుక్రవారం వంద శాతం పంపిణీ పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఎలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్