నర్సీపట్నం మండలం చెట్టుపల్లి గ్రామ శివారులో శుక్రవారం పేకాట శిబిరంపై దాడి చేసినట్లు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ పీ. రాజారావు తెలిపారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. అలాగే వారి వద్ద నుంచి రూ. 5040 నగదు స్వాదీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. గ్రామాల్లో ఎక్కడైనా పేకాట, కోడిపందాలు వంటివి నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.