నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో 17 సచివాలయాల్లో పెన్షన్లను సచివాలయం సిబ్బంది గురువారం పంపిణీ చేసారు. మున్సిపాలిటీలో 7, 175 మంది లబ్ధిదారలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ రవిబాబు తెలిపారు. సాయంత్రం లోగా పంపిణీ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు వార్డ్ ఎడ్మిన్ రేణుక తెలిపారు. ఉదయం నుంచి పంపిణీ కార్య క్రమం సిబ్బందితో కలిసి చేస్తున్నామని పేర్కొన్నారు.