ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని మాధవధార కుంచుమాంబ అమ్మవారి ఆలయంలో శుక్రవారం విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పూజలు చేశారు. 50వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆయనకు స్వాగతం పలికారు. భారత సైనికులు, ప్రజల క్షేమం కోసం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్కు తగిన గుణపాఠం చెప్పాలని వారు కుంకుమ పూజలు నిర్వహించారు.