పాయకరావుపేటలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు చేధించారు. ఇందులో బాలనేరస్తుడితో పాటు మరొక నిందితుడు షేక్ మహబూబ్ బషీద్ తో కలిసి గంజాయి మత్తులో విగ్రహాన్ని ధ్వంసం చేశారని డీఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. పాత కక్షలు కారణంగా ఈ కేసును టి. దుర్గాప్రసాద్ అనే వ్యక్తిపై నెట్టి వేయడానికి వీరు ప్రయత్నించారని, ఒకరిని అరెస్టు చేసి బాలనేరస్తుడిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.