పెందుర్తి నియోజకవర్గంలో సింహాచలం పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని ఈఈ శ్రీనివాసరావు గురువారం తెలిపారు. చెట్టు కొమ్మలు తొలగించే క్రమంలో శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సింహపురికాలనీ, సింహాచలం, ప్రియా గార్డెన్స్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.