
విశాఖ: అభివృద్ధి పనులకు జీవీఎంసీ స్థాయి సంఘం ఆమోదం
జీవీఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు స్థాయి సంఘం ఆమోదం తెలిపిందని స్థాయి సంఘం చైర్ పర్సన్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో స్థాయి సంఘం సభ్యులతో సమావేశం నిర్వహించారు. 110 అంశాలతో పాటు ఒక టేబుల్ అజెండా అంశం కలిపి మొత్తం 111 అంశాలు పొందుపరిచారని, వాటిని స్థాయి సంఘం సభ్యులు చర్చించిన పిదప 110 అంశాలు ఆమోదం పొందాయన్నారు.