ప్రధానమంత్రి మోడీ పిలుపుమేరకు గాంధీ జయంతి రోజున స్థానిక
ఎన్టీఆర్ స్టేడియంలో గల గాంధీ విగ్రహానికి బిజెపి నర్సీపట్నం నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ తమరాన ఎర్రం నాయుడు, నాతవరం బిజెపి మండల అధ్యక్షులు లాలం వెంకటరమణారావు, నర్సీపట్నం రూరల్ అధ్యక్షులు బోలెం శివ తదితర నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. నర్సీపట్నంలో చేనేత వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని పిలుపునిచ్చారు.