మర్రిపాలెంలో ఆహారం ప్యాకెట్లు పంపిణీ

1259చూసినవారు
మర్రిపాలెంలో ఆహారం ప్యాకెట్లు పంపిణీ
నాతవరం మండలం వై. డి పేట పంచాయతీ, మర్రిపాలెం ఎస్సీ కాలనీ యూత్ లీడర్ జూనియర్ జగన్ శివ జన్మదినం సందర్భంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు స్థానిక వైసీపీ నాయకులు మంకు సాంబమూర్తి చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా సాంబమూర్తి మాట్లాడుతూ.. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో జూనియర్ జగన్ శివ జన్మదినం పురస్కరించుకొని ఈ విపత్కర పరిస్థితుల్లో నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు పంపిణీ చేయడం మంచి కార్యక్రమం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొత్స చిట్టి బాబు, నాలుగో వార్డు మెంబరు, అరుణ, ఎస్సీ కాలనీ సీనియర్ నాయకులు, లోవరజు, నానాజీ, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్