వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్గా మారిన విషయం తెలిసిందే. దస్తగిరి ఫిర్యాదు మేరకు మరో నలుగురిపై తాజాగా కేసు నమోదైంది. విచారణ సమయంలో తనను పులివెందుల గత డీఎస్సీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్య, కడప సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ఇబ్బంది పెట్టినట్లు కొద్దిరోజుల క్రితం దస్తగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి నలుగురిపై జీరోఎఫ్ఐఆర్ కింద కేసు నమోదైంది.