అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లోని ఎస్ఎస్ ఫార్మా కంపెనీలో బుధవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. రసాయన వ్యర్థాల ట్రీట్మెంట్ ప్లాంట్ వద్ద లెవెల్స్ చెక్ చేస్తుండగా విషవాయువుల ప్రభావంతో కార్మికులు చంద్రశేఖర్, కుమార్ మృతి చెందారు. మరో కార్మికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేయగా దర్యాప్తు కొనసాగుతోంది.