ట్రాఫిక్ రూల్స్ పై కాలేజీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బుధవారం అనకాపల్లి మండలం కొత్తూరు గ్రామం ఏఎంఏఎల్ కాలేజీలో జరిగిన సదస్సులో అనకాపల్లి ట్రాఫిక్ సీఐ ఎం. వెంకటనారాయణ విద్యార్థులకు ట్రాఫిక్ నియమ నిభందనలు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ కోసం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేస్ డ్రైవింగ్ చేసే ప్రమాదాలకు గురి కావద్దని తెలిపారు.