అనకాపల్లి: ఏర్పాటులకు జీవీఎంసీ సహకారం అందించాలి

74చూసినవారు
అనకాపల్లి: ఏర్పాటులకు జీవీఎంసీ సహకారం అందించాలి
ఈనెల 26న అనకాపల్లి పట్టణంలో జరిగే హనుమాన్ శోభయాత్రకు వేల సంఖ్యలో భక్తులకు హాజరుకానున్నారని ర్యాలీ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయంసేవక్, వినాయక ఉత్సవ నిమజ్జనొత్సవ కమిటీ సభ్యులు జీవీఎంసీ అధికారులను కోరారు. గురువారం జీవీఎంసీ అనకాపల్లి జోన్ కార్యాలయంలో సూపర్డెంట్ కి వినతిపత్రం సమర్పించారు. అనకాపల్లి ఎంపీ రమేష్, ఎమ్మెల్యే రామకృష్ణ, హిందూ సంస్థ నాయకులు హాజరుకానున్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్