ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా గోడ పత్రికను శుక్రవారం అచ్చుతపురంలో జరిగిన జిల్లా అధికారుల సమీక్ష కార్యాలయంలో యలమంచిలి నియోజకవర్గం శాసన సభ్యులు సుందరపు విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ నెల 15న యలమంచిలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.