అనకాపల్లి పట్టణం వేల్పుల వారి వీధిలో వేంచేసియున్న గౌరీ పరమేశ్వరుల ఆలయ మూడవ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. భక్తులు పలువులు అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, ఆలయ కమిటీ చైర్మన్ వాకాడు బాబు అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.