నాటుసారా తయారు చేసిన, అమ్మిన, రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జోన్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామ చంద్ర మూర్తి తెలిపారు. నవోదయం 2. 0 కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి కశింకోట మండలం ఉగ్గినపాలెం గ్రామంలో కళా జాతర ఏర్పాటు చేశారు. ఇందులో నాటుసారాకు వ్యతిరేకంగా అవగాహన కలిగించారు. నాటుసారా సంబిందిత ఫిర్యాదులకు 14405 టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయలన్నారు.