అనకాపల్లి జిల్లాలో ఎంఎస్ఎంఈల సర్వే శుక్రవారం నుంచి ప్రారంభం అవుతుందని ఇండిస్ట్రీస్ జనరల్ మేనేజర్ జి. నాగరాజరావు తెలిపారు. గురువారం అయిన మాట్లాడుతూ ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, దీని ద్వారా అన్ని రంగాల్లో ఎంఎస్ఎంఈలను గుర్తించి, భవిష్యత్తులో మరిన్ని సౌకర్యాలు కల్పించడానికి సమగ్ర మార్గదర్శకాలను జారీ చేసినట్లు చెప్పారు.