ఎన్టీఆర్ హాస్పిటల్లో మోటార్ రిపిర్ చేసి త్రాగు నీరు అందించాలని సర్వేజనా ఐక్యవేదిక అధ్యక్షులు కోరిబిల్లి పరి డిమాండ్ చేశారు. శుక్రవారం అనకాపల్లి పట్టణం సంస్థ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతవారం రోజుల నుంచి ఎన్టీఆర్ హాస్పిటల్లో మంచినీరు మోటర్ రిపేర్ కావడంతో తాగడానికి నీరు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ఆసుపత్రి ఉన్నత అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలని కోరారు.