అనకాపల్లి మార్కెట్ కమిటీ కొత్తగా ఛైర్మన్ గా తెదేపా పార్టీ సీనియర్ నాయకుడు పచ్చికూర రామును నియమిస్తూ బుధవారం పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి మండలం కూండ్రంకు చెందిన ఈయన గ్రామ వార్డు సభ్యుడి నుంచి పలు పదవులు పొందారు. ప్రస్తుతం ఆయన మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందా సత్యనారాయణకు అనుచరుడుగా పార్టీలో కొనసాగుతున్నారు. ఈ పదవి రావడం పట్ల కూండ్రంకు గ్రామంలో కార్యకర్తలు సంబరాలు నిర్వహించారు.