అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకున్న వరుస చోరీల కేసు పరిష్కారంలో జిల్లా పోలీసులు చొరవ తీసుకున్నారని జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా కొనియాడారు. బుధవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోటవురట్ల మండలం, రాజుపేట జంక్షన్ వద్ద వరుసగా ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసి, మొత్తం 23 కేసులలో చోరీచేసిన 63 తులాల బంగారం, 6.5 తులాల వెండి, రూ.15,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.