అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షుగర్ బీట్ (చక్కెర దుంపలు) పంట సాగు ఆశాజనకంగా ఉందని చెరకు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.ఆదిలక్ష్మి తెలిపారు. సోమవారం ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ, పంచదార, ఇథనాల్ తయారీకి ఉపయోగపడే షుగర్ బీట్ సాగుకు రాష్ట్రంలో ఏఏ ప్రాంతాలు అనువైనవో తెలుసుకునేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆరు ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నట్టు చెప్పారు. చల్లని వాతావరణంలో బాగా పెరిగే ఈ పంట ఆరు నెలల్లోనే కోతకొస్తుందని, అనకాపల్లి ఆర్ఏఆర్ఎస్లో ఎల్6 రకాన్ని నాటామని పేర్కొన్నారు.