అరకులోయ మండలంలోని గన్నెల పిహెచ్సి పరిధి వంతాలగుడలో ఆశా కార్యకర్త రాధమ్మ ఆధ్వర్యంలో గిరిజనులు శుక్రవారం డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలువల్లోని మురుగు నీటిని తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఆమె మాట్లాడుతూ. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. మలేరియా డెంగ్యూ చిక్న్ గున్య వంటి దోమల ద్వారా వచ్చే వ్యాధుల గురించి గిరిజనులకు అవగాహన కల్పించారు.