'సుపరిపాలనలో తొలి అడుగు' కార్యక్రమం అరకులోయ మండలంలోని సుంకరమెట్టు, పెద్ద గంగుడి గ్రామాల్లో నిర్వహించారు. ఇందులో టీడీపీ అరకు నియోజకవర్గ ఇన్ చార్జ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ సియ్యారి దొన్ను దొర పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. టీడీపీ పరిశీలకుడు కరణం శివరామకృష్ణ కూడా పాల్గొన్నారు.