అరకు: కంకరరాళ్లు పోశారు.. రోడ్డు నిర్మాణం మారిచారు

60చూసినవారు
అరకులోయ మండలంలోని గత్తనగుడ జంక్షన్ నుంచి బస్కి వరకు తారురోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజనులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో 18 కిలోమీటర్ల తారురోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ. 18 కోట్ల నిధులు మంజూరు చేసింది. నేటికి 6 సంవత్సరాలు అవుతున్నా రోడ్డు నిర్మాణం చేపట్టకుండా కంకరరాళ్లు పోసి వదిలేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గురువారం తెలిపారు. ఈ సమస్యపై స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్