ఆంధ్రప్రదేశ్ సి ఆర్ డి కమిషనర్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పనులపై అనంతగిరి, అరకు, డుంబ్రిగుడ, హుకుంపేట, మండలాల క్షేత్రస్థాయి సిబ్బందికి శుక్రవారం ఎపిడి పవన్ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కల్పించారు. ముఖ్య అతిథిగా పిడి విద్య సాగర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ఆరు నెలల్లో వ్యవసాయ అనుసంధానంకు సంబంధించిన పనులను పూర్తి చేసి ఉపాధి వేతనం రోజుకు మూడు వందలు తగ్గకుండా వేతనదారులకు చెల్లించాలన్నారు.