డుంబ్రిగుడ మండలంలోని కితలంగిలో గురువారం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షుడుగా కొర్రా. నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఉపాధ్యక్షుడిగా రమ్మిని కార్యదర్శిగా రాంబాబును ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి అరకు పార్లమెంట్ కోశాధికారి నాగేశ్వరరావు పాల్గొని వారిని అభినందించారు. పంచాయతీ పరిధి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు స్వామి సుబ్బారావు తదితరులున్నారు.