హుకుంపేట మండలంలోని పత్రిమెట్టలో ఆశా కార్యకర్త రమణమ్మ ఆధ్వర్యంలో గిరిజనులు శుక్రవారం ఫ్రైడే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని కాలువల్లో, చెత్తచెదారాలు, మురుగును తొలగించి బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. ఆమె మాట్లాడుతూ. కురుస్తున్న అకాల వర్షాలతో గిరిజనులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గ్రామంలోని పరిసరాల్లో మురికి నీరు, నిల్వ నీరు ఉంచరాదన్నారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలని కోరారు.