కొయ్యూరు మండలంలోని శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. మండలంలోని నల్లబిల్లి గ్రామానికి చెందిన మోహన్ రావు, అప్పారావు, నాగేశ్వరరావు, సంజీవరావు, రాజుబాబు తదితరులు ఆటోలో బూదరాళ్ళ గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బూదరాళ్ల ఘాట్ రోడ్డులో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వారికి తీవ్ర గాయాలు కాగా 108లో పెదవలస ఏరియా ఆసుపత్రికి తరలించారు.