ముంచంగిపుట్టు మండలంలోని బూసిపుట్ అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం కిశోర వికాసం వేసవి శిక్షణ తరగతులను నిర్వహించారు. అంగన్వాడీ టీచర్ ఉశశ్రీ మాట్లాడుతూ, కౌమార దశలో ఉన్న బాలికలకు కిశోర వికాసంపై వివరించి, వారికి కావాల్సిన పౌష్టికాహారం గురించి తెలిపారు. బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రత, ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ చట్టాల పట్ల, అవగాహన కలిగి ఉండాలన్నారు. మే 2వ తేది నుంచి, జూన్ 10వ తేదీ వరకు, ఈ తరగతులు జరుగుతాయని తెలిపారు.