రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనంతగిరి మండలంలో 95. 5% సకాలంలో ఇంటింటికి పంపిణీ చేయడం జరిగిందని ఎంపీడీవో నగేష్ తెలిపారు. అయన మాట్లాడుతూ మండలంలో గల 24 గ్రామ పంచాయతీలకు 6060 పెన్షన్ దారులు ఉంటే 5791 పెన్షన్లు మొదటి రోజు పంపిణీ చేసి రూ. 2,40,92000 సొమ్మును పంపిణీ చేశామని తెలిపారు. మిగిలిన పెన్షన్లు శుక్రవారం నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ అన్నారు.