మన ఊరు బడిని రక్షించుకుందామని, మోడల్ స్కూల్లో ఏర్పాటు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రెడ్డి ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన గోడపత్రికను శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో 3,4,5 తరగతులను విలీనం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. దీనివల్ల పేద విద్యార్థులను విద్యకు దూరం చేయడమేనన్నారు. తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు.