మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తండ్రి నాలుగేళ్ల కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన ఘటన బుధవారం భీమిలిలో వెలుగులోకి వచ్చింది. విశాఖలోని జాలరిపేటకు చెందిన నిందితుడు (30) మంగళవారం భార్యతో గొడవపడి నాలుగేళ్ల కుమార్తె, ఆరేళ్ల కుమారుడిని వెంట పెట్టుకుని భీమిలి సమీప తగరపువలసకు వెళ్లాడు. అక్కడే అతిగా మద్యం తాగి నిర్మానుష్య ప్రాంతంలో ఈ ఘటనకు పాల్పడ్డాడు. బాలిక కేకలు విన్న స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా నిందితుడు విజయనగరం జిల్లాకు చెందినవాడు.