వ్యర్ధాలను శుద్ధిచేసి తిరిగి వినియోగించే విధంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలని ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంతరణ మండలి చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య పిలుపునిచ్చారు. వ్యర్థాల నుంచి సంపదను సృష్టించే సర్క్యులర్ ఎకానమి విధానంపై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాయన్నారు. గురువారం విశాఖ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో వ్యర్థాల నిర్వహణ-సర్క్యులర్ ఎకానమీపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.