పద్మనాభంలో ఆదివారం ఏరువాక కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించి రైతులకు ప్రభుత్వ రాయితీ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. అధిక దిగుబడుల కోసం శాస్త్రీయంగా సాగు చేయాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు.