ఆదివారం మధురవాడ వంతెన వద్ద ఆటో, ద్విచక్ర వాహనం ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదం అనంతరం ఆటో డ్రైవర్, బైక్పై ఉన్న కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ట్రాఫిక్కు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీస్ వెంటనే అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టి ట్రాఫిక్ను పునరుద్ధరించారు.