విశాఖ: వైభవంగా అప‍్పన్న కల్యాణం

64చూసినవారు
సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణం శుక్రవారం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కళ్యాణములో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరముస్వామివారి అంతరాలయ దర్శనం కల్పించారు.

సంబంధిత పోస్ట్