బుచ్చయ్యపేట మండలంలో రాజాం నుంచి తురకలపూడి వరుకు సుమారు 5కిలోమీటర్ల రహదారిని మరమ్మతులు చేయించడానికి జీడిపప్పు ఫ్యాక్టరీ యజమాని నటరాజన్ చంద్రప్రభూ ముందుకు వచ్చి బుధవారం మరమ్మత్తు పనులు ప్రారంభించారు. దీంతో గొoప తో పాటు ఎర్ర వాయి ప్రజలు ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్డు మరమ్మతు గురవడంతో ఎర్రవాయి ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులు మహిళలు ముఖ్యంగా రోగులు అవస్థలు పడుతున్నారన్నారు.