తమ సర్వీసును పరిగణనలోకి తీసుకుని తమను పంచాయితీ ఉద్యోగులుగా గుర్తించాలని ఎన్ఆర్ఈజీఎస్ లో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేశారు. బుధవారం బుచ్చయ్యపేట ఎంపీడీవో కార్యాలయం వద్ద వారు నిరసన తెలిపారు. ఎనర్జీ జిఎస్ లో అన్ని కేటగిరి ఉద్యోగులకు జీతాలు పెరిగిన తమకు మాత్రం పెరగలేదన్నారు. ఏ స్థాయిలోనూ తమను ఉద్యోగులుగా గుర్తించకపోగా చులకనగా చూస్తున్నారని ఆవేదన చెందారు. ఈ మేరకు ఎండీవోకు వినతిపత్రం అందజేశారు.