సుమారు నాలుగేళ్లుగా గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న ఒక వ్యక్తిని చోడవరం పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. 2021లో గంజాయి కేసులో ముద్దాయిగా ఉన్న అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలం కుమ్రిపాడ గ్రామానికి చెందిన బి సాయి నాగేశ్వరరావు ను చోడవరం పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు